బోథ్, మే 5 : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీదేవి(14) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు వివరాల ప్రకారం.. శ్రీదేవి సోమవారం రాత్రి వాంతులు, విరోచనాలు చేసుకున్నది. మంగళవారం బహిర్భూమికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో పడిపోయింది. కుటుంబీకులు గమనించగా అప్పటికే మృతి చెందిందని తండ్రి మారుతి తెలిపాడు.