సీసీసీ, నస్పూర్ 25 : రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలని మూవ్మెం ట్-21 జాతీయ కమిటీ సభ్యుడు ఎన్ ప్రేమకుమార్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లో ఎం-21 డిగ్నిటీ ఫెస్ట్ను నిర్వహించారు. ఎం-21 ఉద్యమం సమష్టిగా కొనసాగుతుందన్నా రు.
గ్రామ, పట్టణ, నగరాల్లో ఎం-21 ఉద్య మం అంబేద్కర్ భావజాలంతో కొనసాగుతుందన్నారు. బడుగు, బలహీన, దళిత, గిరిజన ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఎం-21 ఉద్యమం మొదలయ్యిందన్నారు. అనంతరం ఎం-21 పుస్తకా న్ని ఆవిష్కరించారు. ఫెస్ట్లో ఎం-21 సభ్యు లు ఆటా పాటలతో ఉత్సాహంగా గడిపారు. మూఢ నమ్మకాల నిర్మూలనలపై నిర్వహించిన ఉమా మ్యాజిక్ షో ఆకట్టుకున్నది. కస్తూరి కళాకారిని నృత్యం ఆకట్టుకుంది.