తలమడుగు, ఫిబ్రవరి 24 : తలమడుగు మండలం భరంపూర్ గుట్టపై గల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. గుట్టపై నుంచి కిందికి శుక్రవారం సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం జనసంద్రమైంది.
వేంకటేశ్వర స్వామి నామస్మరణతో మార్మోగింది. మండలంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.