వేమనపల్లి,ఫిబ్రవరి 18 : చేతి పంపు ఉన్నప్రాంతంలో మురుగు నీరు చేరి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని జక్కెపల్లి గ్రామంలోని ఎస్టీ వాడలో ఉన్న చేతి పంపు చుట్టూ మురుగునీరు చేరింది. దీంతో తాగునీటిని తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేతి పంపు పక్కన ఎలాంటి డ్రైనేజీ లేకపోవడంతో నీరంతా రోడ్డుపైకి చేరి ఇండ్ల ముందు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చేతి పంపు చుట్టూ ఫ్లాట్పారం లేకపోవడంతో గుంత ఏర్పడి నిత్యం మురుగు నీరు నిల్వ ఉంటున్నది. ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మురుగునీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.