దండేపల్లి, మే 20 : మండలంలోని తాళ్లపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కన గతేడాది గ్రంథాలయం ప్రారంభించారు. ఆపై నిరుపయోగంగా మారగా, సోమవారం ‘తెరుచుకోని లైబ్రరీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్థానిక జీపీ అధికారులు, సిబ్బంది స్పందించారు.
లైబ్రరీని శుభ్రం చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నుంచి లైబ్రరీ ప్రతిరోజూ తెరిచే ఉంటుందని, విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీపీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. లైబ్రరీ తెరిచేందుకు కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.