ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 6 : ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే నాగోబా జాతరను విజయవంతం చేద్దామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మంగళవారం నాగోబా దర్బార్ హాల్లో జిల్లాస్థాయి అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా శాఖలవారీగా చేసిన ఏర్పా ట్ల పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి చేపట్టే పనుల వివరాలను శాఖలవారీగా అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల నుంచి భక్తులు తరలివస్తారని, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మర్రిచెట్లతోపాటు గోవాడ్ ప్రాంతం లో ఉండే మెస్రం వంశీయులకు మరుగుదొడ్లతోపాటు స్నానపు సౌకర్యాలు కల్పించి నీటి సరఫరా చేయాలన్నారు. భక్తుల రద్దీ ఉండే ప్రాంతంలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పు డు చేస్తూ శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రధాన ప్రాంతాల్లో బారికేడ్లు, ప్రత్యేక పార్కింగ్, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి ఆలయా న్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. జనరేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లను శాశ్వతంగా ఉండేలా చేపట్టాలని పేర్కొన్నారు. శాఖలవారీగా అధికారులకు ఇచ్చిన జాతర ఏర్పాట్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ స్టాల్స్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
అన్ని సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్యే బొజ్జు
నాగోబా జాతరను పురస్కరించుకుని జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. నాగోబా దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై సమీక్షలో మాట్లాడారు. త్వరలోనే మెస్రం వంశీయులను సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులను కల్పిస్తామన్నారు. అధికారులు కలిసి కట్టుగా సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బూ గుప్తా, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్మహతో, ఐటీడీఏ ఏవో రామ్బాబు, అదనపు డీఆర్డీవో రవీందర్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ఐటీడీఏ ఈఈ భీంరావ్, డీఎల్పీవో భిక్షపతి గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ రోహిదాస్, ఆలయ ఈవో రాజమౌళి, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో పుష్పలత, డీఎస్పీ నాగేందర్, సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.