బోథ్, డిసెంబర్ 27: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ను బోథ్ ఎమ్మెల్యే రాథో డ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్సీ దండె విఠల్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. జిల్లాలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విన్నవించగా, మంత్రి సానుకూలంగా స్పం దించినట్లు వారు పేర్కొన్నారు. కలిసిన వారిలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్రెడ్డి, సంతోష్, లస్మన్న తదితరులు ఉన్నారు.