బోథ్: బోథ్ కోర్టు భవన నిర్మాణ పనులు తొందరగా ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వినతి పత్రం అందించారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి భవన నిర్మాణ పనులపై విన్నవించారు. పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం కోర్టు నిర్వాహణ అద్దె భవనంలో కొనసాగుతున్నందున కొత్త భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలనివారు కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు అంగధ్ కేంద్రే, ఠాకూర్ రూపేందర్సింగ్, ఆడెపు హరీష్, కుమ్మరి విజయ్, విక్రమ్ సింగ్ ఉన్నారు.