ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 22 : జిల్లాలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం త వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కే సురేశ్ కుమార్ అన్నారు. పట్టణంలోని అంబేదర్ చౌక్ వద్ద పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ను ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో కలిసి అంబేదర్ చౌక్, మజీద్ మహల్లా, బ్రాహ్మణవాడ, కసాబ్వాడీ, సందీప్నగర్, వీధుల గుండా కవాతు నిర్వహించారు.
అనంతరం పారామిలటరీ దళాలకు ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మక పో లింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించామన్నా రు. జిల్లాలో మొత్తం 597 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఇందులో నార్మల్ 432 , క్రిటికల్ 92, ఎల్డబ్ల్యూఈ 73 పోలింగ్ కేంద్రాలుగా ఉన్నట్లు గు ర్తించామన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృ ష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్య క్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ వెంకటరమణ , సీఐలు రాజు, శ్రీనివాస్, నరేందర్, మల్లేశ్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగజ్నగర్, అక్టోబర్ 22: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. కేంద్ర పారా మిలటరీ బలగాలతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆదివారం కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు జి ల్లాకు రెండు కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. ఒక బలగాన్ని సిర్పూర్ నియోజకవర్గానికి కేటాయించామని పేర్కొన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లోనూ కవాత్ నిర్వహిస్తామని చెప్పారు. ఓటు హక్కు పారదర్శకంగా వినియోగించుకునేలా జిల్లా పోలీసులు అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐలు బుద్ధే స్వామి, నాగరాజు, ఎస్ఐలు, పారా మిలటరీ బలగాలు పాల్గొన్నారు.