తిర్యాణి, ఏప్రిల్ 13: నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యాణి మండలంలో నీతి ఆయోగ్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రంజిత్కుమార్తో కలిసి పరిశీలించారు. అంగన్వాడీ, ఐకేపీ తదితర శాఖలకు చెందిన భవనాల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
చెలిమెల గ్రామాన్ని సందర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అంగన్వాడీలకు సరాఫరా అవుతున్న పౌష్టికాహారాన్ని అర్హులకు అందేలా చూడాలని టీచర్కు సూచించారు. చెలిమెలలోని 30 పడకల దవాఖానను సందర్శించారు. ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి సీతారాం, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వేముల మల్లేశ్, ఎంఈవో అంజయ్య, వైద్యులు అక్షయ్, పల్లవి, కృష్ణ పాల్గొన్నారు.