ఖానాపూర్, సెప్టెంబర్ 21 : ఖానాపూర్లోని పద్మశాలీ సంఘం భవనంలో తెలంగాణ ఉద్యమ కర్త, ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల లు వేసి నివాళులర్పించారు. బాపూజీ ప్రసంగాల తో తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు వివరించి చైతన్య వంతులును చేశారని సంఘ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, నడిమట్ల రమేశ్, ఎనుగందుల నారయణ, నర్సయ్య, చిన్న భీమన్న, ఆంజయ్య, భీమేశ్, పద్మశాలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర
దస్తురాబాద్, సెప్టెంబర్ 21 : తెలంగాణ కోసం మూడు దశల ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని ప్రధానో పాధ్యాయుడు బీ మల్లయ్య పేర్కొన్నారు. గొడి సెర్యాలలోని ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల లో గురువారం ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుల ర్పిం చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, రాధిక, వెంకట్రాజం, సత్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.