కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో మంచి భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లాలోని వాంకిడి మండలం అర్లి గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు లతో కలిసి మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్య అంస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తారన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.