కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా అందిస్తు న్న రుణాలతో మహిళలు తమకిష్టమైన రంగాలను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. గతేడాది జిల్లాకు రూ. 47 కోట్ల రు ణాలు కేటాయించగా, ఇందులో 98 శాతం నిధులను స్వయం సహాయక సభ్యులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఏడాది అదనంగా రూ. 10 కోట్లు కలిపి రూ. 57 కోట్ల రుణ ప్రణాళికలు అ మలు చేయనున్నారు. అయితే, ఇప్పటి వరకు వ్యాపారాలు, పారిశ్రామిక రంగాలు నెలకొల్పేలా ప్రోత్సహించిన ప్రభుత్వం, ఈసార్ సోలార్ విద్యు త్ యూనిట్ల ఏర్పాటుకు సాయమందించనున్నది.
జిల్లాలో 50 సోలార్ విద్యుత్ యూనిట్లు..
జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ ఏడాది 50 సోలార్ విద్యుత్ యూని ట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ. లక్ష చొప్పున రూ. 50 లక్షలు కేటాయించింది. ఆసక్తి గల మహిళా సంఘాల సభ్యులకు సోలార్ యూనిట్లు అమలు చేయనున్నారు. ఒక కేవీ(కిలో వాట్) యూనిట్ మొదలుకొని.. 10 కేవీ యూనిట్ల వరకు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాలో మొదట ప్రయోగాత్మకంగా 1 నుంచి 3 కేవీ యూనిట్లు ఏర్పాటు చేయాలని భా విస్తున్నారు. ఒక కేవీ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ పోను రూ. 65 వేల వరకు ఖర్చు అవుతుంది. మహిళలు తమ ఇంటి అవసరాలకు వినియోగించుకునే విద్యుత్పోను.. మిగతా కరెంట్ను విక్రయించుకోవచ్చు.
నివేదికలు సిద్ధం
ఒక కేవీ సోలార్ ప్లాంటు ద్వారా ఏడాదిలో 1400 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సింగిల్ ఫేజ్ ద్వారా గృహ అవసరాలకు విద్యుత్ వినియోగించుకోవచ్చు. 2 కేవీ యూనిట్ ద్వారా సింగిల్ ఫేజ్ విద్యుత్ ఏడాదికి 2800 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 3 కేవీ ద్వారా సింగిల్, త్రీఫేజ్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 4200 యూనిట్ల విద్యుత్ జనరేట్ అవుతంది. ఇలా 10 కేవీల వరకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసేలా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఇలా ఆన్ గ్రిడ్ సిస్టం ద్వారా, ఆఫ్ గ్రిడ్ సిస్టం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధికారులు డిటేయిల్డ్ రిపోర్టులు సిద్ధం చేశారు.
ఒక్కసారి నెలకొల్పితే ఐదేండ్ల వరకు..
సోలార్ యూనిట్ ప్లాంట్ను ఒకసారి నెలకొల్పితే ఐదేండ్ల వరకు నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. సోలార్ ప్యానల్కు 25 ఏండ్ల వరకు వారెంట్ ఇవ్వనున్నారు. తక్కువ స్థలంలోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. స్త్రీనిధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ సోలార్ ప్లాంట్లు విజయవంతంగా నడిస్తే.. జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నారు.