రామగిరి, జనవరి 7: బొగ్గు ట్రాన్స్పోర్టు లారీ ల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని పెద్దపల్లి జ డ్పీ చైర్మన్ పుట్ట మధు సింగరేణి అధికారులను కో రారు. ఆర్జీ-2 గౌతమి గెస్ట్హౌస్లో ఆర్జీ రీజియన్ జీఎంలు, సింగరేణి అధికారులు, ఆర్డీవోతో శనివా రం సమావేశం నిర్వహించారు. భూ సేకరణ సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. ట్రాన్స్పోర్టు లారీల్లో స్థానికులకే అవకాశం కల్పించే విషయంలో జీఎం లు చొరవ తీసుకోవాలని కోరారు. ఇతర ప్రాంతాల లారీలను మంథని ప్రాంతంలోకి అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మంథని ఆర్డీవో వీరబ్రహ్మచారి, తహసీల్దార్ రాంమోహన్, ఆర్జీ-2 జీఎం మనోహ ర్, ఆర్జీ-3 జీఎం వెంకటేశ్వరరావు, నాయకులు పూదరి సత్యనారాయణ, దాసరి రాయలింగు, కనవేన శ్రీనివాస్, ముత్యాలు, తదితరులున్నారు.