దస్తురాబాద్, ఏప్రిల్10 : జీవ మనుగడకు అడవులే ఆధారమని, వాటిని ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలని ఎంపీపీ సింగరి కిషన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు లేకపోతే ప్రాణ వాయువు ఉండదని తెలిపారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది మొక్కలను నాటించి, సంరక్షిస్తున్నారని కొనియాడారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు డిప్యూటీ ఎఫ్ర్వో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మతోట రాజమణి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ముస్తాఫా, కడెం డిప్యూటీ ఎఫ్ఆర్వో మమత, ఎఫ్ఎస్వో లచ్చిరాం, ఎఫ్బీవోలు స్రవంతి, హరిత, శివ కుమార్, సదా ముత్తన్న, ఎంఏ అలీమ్, లక్షీ, స్వాగత్ రెడ్డి, నాయకులు సంతపూరి శ్రీనివాస్, నిమ్మతోట శివయ్య, అటవీ శాఖ సిబ్బంది తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న సీపీ సజ్జనార్
టోక్యో ఒలింపిక్స్కు అన్షు, సోనమ్ అర్హత