న్యూఢిల్లీ: భారత రెజ్లర్లు అన్షూ మాలిక్, సోనమ్ మాలిక్లు.. ఈ ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించారు. శనివారం జరిగిన ఏషియన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 19 ఏళ్ల అన్షు, 18 ఏళ్ల సోనమ్లు.. జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయికి వెళ్లారు. అన్షు, సోనమ్లతో పాటు వినేశ్ .. టోక్యోకు అర్హత సాధించారు. ఇప్పటి వరకు ఏడుగురు రెజ్లర్లు ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యారు. మెన్స్ ఫ్రీ స్టయిల్లో బజరంగ్ పూనియా, రవి దహియా, దీపక్ పునియాలు అర్హత సాధించారు. 57కేజీల విభాగంలో అన్షూ అర్హత సాధించింది. సాక్షి మాలిక్పై విజయం సాధించిన సోనమ్.. 62 కిలోల విభాగంలో ఒలింపిక్స్లో పోటీపడనున్నది.