కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/భైంసా/బోథ్, నవంబర్ 14 : ఈ యేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 9.77 లక్షల ఎ కరాల్లో పత్తి సాగైంది. ఇందులో ఆదిలాబాద్లో 3.52 లక్షల ఎకరాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 3.37 లక్షలు, నిర్మల్లో 1.31 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 1.57 ల క్షల ఎకరాల్లో పంట వేశారు. 68 లక్షల క్విం టాళ్ల పత్తి మార్కెట్ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్ ప్రా రంభంలో భారీ వర్షాలు కురడడంతో పంటలకు నష్టం కలిగింది. లోతట్టు భూము ల్లో నీరు నిల్వ ఉండడంతో మొక్కలు కుళ్లిపో గా, మరికొన్ని కొట్టుకుపోయాయి. వాతావర ణం అనుకూలిస్తే ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ యేడాది ఎకరాకు 5-6 క్వింటా ళ్లు మాత్రమే వస్తుందని రైతులు పే ర్కొంటున్నారు. దీనికితోడు చైనా, పాకిస్తాన్ దేశాల్లో వ రదల కారణంగా దిగుబడి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర పెరగడం కారణం గా చెప్పవచ్చు. అక్టోబర్ రెండో వారం నుంచి దిగుబడులు ప్రారంభం కాగా.. ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు.
రికార్డుస్థాయిలో ధర
ఈ యేడాది పత్తి రైతుల పంట పండుతోంది. గతేడాది కంటే ఈ యేడా ది ధరలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది సీసీఐ ప్రకటించిన మద్దతు ధర రూ.6,025 కాగా.. ప్రైవేటు వ్యాపారులు సీజన్ ప్రారంభంలోనే క్వింటాలుకు రూ.7,300 పెట్టి కొనుగోలు చేశారు. పత్తి సీజన్ ముగిసే సమయానికి రూ.12 వేల వరకు వెళ్లింది. ఈ యేడాది సీసీఐ నిర్ణయించిన ధర రూ.6,380. కాగా.. రెండు నెలల క్రితం నిర్మల్ జిల్లా కుభీర్లో క్వింటాలుకు రూ.10,016 చెల్లించి కొనుగోలు చేశారు. తాజాగా.. సోమవారం బోథ్ మార్కెట్ యార్డులో క్వింటాలుకు రూ. 9,2 00 పలికింది. ఆదిలాబాద్లో రూ. 9,010 ఉండగా.. బోథ్, ఇచ్చోడ(మన్నూర్)లోని జిన్నింగ్ ఫ్యాక్టరీల యజమానులు పోటాపోటీగా రూ.9,200 ధర చెల్లించారు. భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డులో రూ.9,100 పలికింది. దిగుబడి తగ్గే అవకాశం ఉన్నా.. ధర పెరుగుతుండడంతో లోటు పూడ్చుకోవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధర పైపైకి వెళ్తుండడంతో పత్తి ఏరిన రైతులు ఇండ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకానికి మొగ్గు చూపడం లేదు. ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సీసీఐ కంటే మేలు..
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రా ల్లో సవాలక్ష సమస్యలు ఎదుర్కొవాలి. పట్టాదార్ పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకెళ్లాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కొనుగోలు చేయరు. అవస్థలు పడాల్సి వ చ్చేది. సీసీఐ నిర్ణయించిన ధర దక్కాలంటే గగనమయ్యేది. తేమ పేరిట కోత విధించేవా రు. రెండేండ్ల నుంచి ఎటువంటి పత్తినైనా కొనుగో లు చేస్తున్నారు. గతంలో పోల్చితే దిగుబడులు తగ్గడంతో వ్యాపారులు తేమ గురించి పట్టించుకోవడం లేదు. ధర కూడా ఎంతైనా చెల్లించి పోటి పడి కొనుగోలు చేస్తున్నారు.