పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. మంచిర్యా ల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 23 కేంద్రాలు ఏ ర్పాటు చేయగా. 6761 మంది పరీక్ష రాశారు. మొ త్తంగా 458 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
గర్మిళ్ల ఆగస్టు 7 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని రామగుండం ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించి, స్థానిక పోలీస్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5362 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు తెలిపారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నందునా, పూర్తి పారదర్శకంగా ఉం టుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారుల మా టలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. సీపీ వెం ట మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్, స్పెషల్ బ్రాం చ్ ఏసీపీ మోహన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, పట్టణ సీ ఐ బీ నారాయణ నాయక్, లక్షెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్, స్పె షల్ బ్రాంచ్ సీఐ సత్యనారాయణ, తదితరులున్నారు.
365 మంది గైర్హాజరు..
కాగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షకు 365 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని మంచిర్యాల జిల్లా కో ఆర్డినేటర్ చక్రపాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలలో 5727 మంది అభ్యర్థులకు గాను 5362 మంది హాజరైనట్లు చెప్పారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్ర శాంతంగా నిర్వహించినట్లు ఎస్పీ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షా కేంద్రాలను ఏఎస్పీ అచ్చేశ్వర్ రావుతో కలిసి ఆదివారం ఆయన పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. 1492 మంది అభ్యర్థులకు, 1399 మంది హాజరు కాగా, 93 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. దీంతో 93.7శాతం హాజరు నమోదైనట్లు రీజినల్ కోఆర్డినేటర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇద్దరు రూట్ అధికారులు, ఆరుగురు పరిశీలకులు, 12 మంది బయోమెట్రిక్ సిబ్బంది, 62 మంది ఇన్విజిలేటర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎప్ఐలు విధులు నిర్వర్తించారు. కాగజ్నగర్ పట్టణంలో బాలభారతీ హైస్కూల్, వసుంధర డిగ్రీకళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో సీఐలు నాగరాజు, రవీందర్, బుద్దె స్వామి సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.