ఆసిఫాబాద్, జూలై16 :క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హ్యాం డ్బాల్ చాంపియన్ మడావి కరీనా వచ్చేనెల జరిగే వరల్డ్ యూత్ ఉమెన్ హ్యండ్బాల్ పోటీలకు ఎంపికయ్యింది. దీంతో ఐటీడీఏ ద్వారా మంజూరు చేసిన రూ. 2 లక్షల చెక్కును జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రా హుల్రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్బాజ్పాయి, ఎస్పీ సురేశ్ కుమార్తో కలిసి శనివారం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన మడావి కరీనా నేషనల్ లెవల్స్కి ఎంపికవ్వడం సంతోషంగా ఉం దన్నారు. జిల్లాలోని క్రీడాకారులు కరీనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి కడతాల రాకేశ్, కోచ్ అరవింద్, కళాశాల ప్రిన్సిపాల్ రమ్య పాల్గొన్నారు.
మంత్రికి వినతుల వెల్లువ
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లా లో నష్టపోయిన అంచనా విలువపై వివిధ శాఖల అధికారులతో శనివారం మంత్రి ఐకే రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా వాంకిడి మండలంలోని కిరిడి గ్రామానికి రోడ్డు మంజూరు చే యాలని సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. దీంతో జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు రెబ్బె న, ఆసిఫాబాద్, వాంకిడి తదితర మండలాల్లో వంతెనలు కొట్టుకుపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని బ్రిడ్జిలు మం జూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, జడ్పీటీసీ సంతోష్, నాయకులు ము సిర్, నిసార్, దినాకర్, కార్తిక్ తదితరులున్నారు.
మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి
వాంకిడి,జూలై 16: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయని, మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వాంకిడి జడ్పీటీసీ సభ్యుడు అజయ్కుమార్ శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. మంత్రితో పాటు జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ఓయూ టీఆర్ఎస్వీ నాయకులు వైరాగడే రాజ్కుమార్ పాల్గొన్నారు.
మంత్రికి వినతిపత్రం..
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని వాంకిడి వైస్ ఎంపీపీ, ఖిరిడి ఎంపీటీసీ షెండే రాజ్కుమార్, ఖమాన ఎంపీటీసీ హివ్రే ప్రవీణ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వాంకిడి మండలంలోని ఇందాని ఎక్స్రోడ్ నుంచి ఇందాని గ్రామం వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు. అలాగే మండలకేంద్రం నుంచి ఖ మాన గ్రామం వరకు బీటీ రోడ్డును పునరుద్ధరణ చేసి కనర్గాం రోడ్డు వరకు అనుసంధానం చేయాలని వారు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే బీటీ రోడ్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నుంచి జైనూర్ మీదుగా ఆసిఫాబాద్ వెళ్తున్న ఆయన జైనూర్లో ఆగి మండల పరిస్థితులను నాయకులను అడిగి తెలుసుకున్నారు. సర్వే నిర్వహించి పరిహారం అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబుతాలిబ్, టీఆర్ఎస్ మండలాధ్యాక్షుడు ఇంతియాజ్లాల, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, మండల కోఆప్షన్ సభ్యుడు ఫిరోజ్ఖాన్, సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీరావు, సర్పంచ్లు పార్వతీ లక్ష్మణ్, జాలింషావు, నాయకులు కనక గంగారాం, అజ్జులాల, బాబా, జాహేద్, తదితరులు ఉన్నారు.