కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, జూలై 14 (నమస్తే తెలంగాణ) మంచిర్యాల అర్బన్, జూలై 14 :
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వా రం రోజులుగా కుండపోత వర్షం కురుస్తున్నది. వాగులు, వంకలు, చెరువుల కట్టలు తెగిపోగా.. ప్రాజెక్టులు నిండిపోవడంతో బయటకు వదిలిన వరద పరీవాహక గ్రామాలను ముంచెత్తుతున్నది. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా.. ఇండ్లు కూలిపోయి పలువురు నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రెండు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు తామున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వ వి ప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిత్యం సందర్శిస్తూ భరోసానిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో గోదావరి నీటి మట్టం పెరుగుతున్న క్రమంలో కోటపల్లి మండలంలోని దేవులవాడ, కొల్లూరు గ్రామాల్లో ప ర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పలుచోట్ల పు నరావాస కేంద్రాలను సందర్శించారు. కోటపల్లి మం డలం లక్ష్మీపూర్ గ్రామం సమీప తుంతుంగ వాగు, ప్రాణహిత నదీ ప్రవాహం పెరిగి ఇండ్లలోకి వరద రాగా, 63వ జాతీయ రహదారిని జేబీసీతో తెంపి నీటిని బయటకు పంపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితులపై ఆరా తీశారు. ముందు జాగ్రత్తల చర్యల గు రించి వివరించారు. గురువారం చెన్నూర్ మండలం సో మనపల్లిలో వరదలో చిక్కుకున్న ఇద్దరు రైతులను మం త్రి కేటీఆర్తో మాట్లాడి హెలిక్యాప్టర్ తెప్పించి కాపాడా రు. మంచిర్యాల నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే దివాకర్ రావు నిత్యం సందర్శించి బాధితులకు భరోసానిస్తున్నారు.
వరద ముంపునకు గురవుతున్న వారిని పలు భవనాలకు తరలిస్తున్నారు. నడిపెల్లి దివాకర్రావు ట్రస్టు చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు వరద బాధితులకు భోజన వసతి కల్పిస్తున్నారు. బుడగజంగాల కాలనీలో 20 కుటుంబాలను ఎమ్మెల్యే దగ్గరుండి స్థానిక ఫంక్షన్ హాలుకు తరలించి అన్ని ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మారుమూల గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇండ్లు కూలిపోయిన బాధితులను కలిసి మాట్లాడి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వేమనపల్లి – సుంపుటం గ్రామాల మధ్య మత్తడి ఒర్రె ఉప్పొంగిలో లెవల్ వంతెనను, భీమిని మండలంలోని మల్లిడి నుంచి వెంకటాపూర్ వెల్లే రోడ్డు వాగు ఉధృతికి దెబ్బతినడంతో కలెక్టర్ భారతీ హోళికేరి కలిసి పరిశీలించారు. కాసిపేట కేజీబీవీకి వరద రావడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేరుకొని నీటిని మళ్లించి సమస్య పరిష్కరించారు.
ముల్కలపేట గ్రామం వద్ద ఇటీవల 3.50 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన వంతెనతో పరిసర గ్రామాలకు రవాణా ఇబ్బందులు తీరడంతో ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారం మండలంలో ఎమ్మెల్యే రేఖా నా యక్ వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ ప్రజా సమస్యలను ప రిష్కరించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆ త్రం స క్కు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు చా హత్ బాజ్పాయ్, రాజేశం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్ర జలకు భరోసా కల్పిస్తున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టును తరచూ సందర్శిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.