కాగజ్నగర్ టౌన్, నవంబర్ 28 : వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి అన్నారు. సోమవారం పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ హైస్కూల్లో 50వ జిల్లా స్థాయి సైన్స్, గణితం, పర్యావరణ ప్రదర్శన 2022-23, రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన, 10వ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శన, ప్రాజెక్టు కాంపిటేషన్స్, 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2022-23 కార్యక్రమాలను సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్బాజ్పాయి, ఎన్ఐఎఫ్(నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్) జ్యూరీ మెంబర్ శుభాంకర్, జిల్లా సైన్స్ అధికారి కటకం మధూకర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వైజ్ఞానిక ప్రదర్శనల్లో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. చదువుల్లో ప్రతిభ కనబర్చి భవిష్యత్లో సైంటిస్టులుగా ఎదిగి.. రాణించాలని ఆకాంక్షించారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 5 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం వల్ల శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని, మన ఊరు-మనబడితో పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల బోధన అందిస్తున్నారని కొనియాడారు. మధ్యాహ్న భోజనం పథకంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. నియోజకవర్గానికి 11 జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్జీవో, దాతల సహకారంతో విద్యాలయాలకు 100 కలర్ టీవీలను అందించామని, త్వరలోనే మిగతా పాఠశాలలకు పంపిణీ చేస్తామని చెప్పారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చని, డిజిటల్ విద్యకోసం బైజూస్ సహకారంతో ట్యాబ్లు అందించారని, సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇన్స్పైర్ స్కాలర్ షిప్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని ఆమె తెలిపారు. అనంతరం జ్యోతిబాఫూలే చిత్రపటానికి జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ చాహత్బాజ్పాయ్, ఫాతిమాకాన్వెంట్సిస్టర్ సాఫల్య సీవీరామన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. నృత్యాలు చేసిన విద్యార్థులను అభినందించారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, ఎంఈవో భిక్షపతి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.