కుమ్రం భీం ఆసిఫాబాద్ : గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలు అవుతున్నాయని ఆమె తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని ఆమె పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.