కుమ్రం భీం అసిఫాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు.
మంగళవారం జైనూర్, సిర్పూర్ (యూ) మండలాల్లో కల్యాణ లక్ష్మి చెక్కులను బొట్టు పెట్టి లబ్ధిదారులకు ఆమె అందజేశారు. అనంతరం వారికి భోజనాలు వడ్డించారు.
ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ..కల్యాళ్యాణ లక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.10,0116 వేలు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు తదితరులు పాల్గొన్నారు.