కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని సిర్పూర్(టి) మండలంలో నవేల్లి గ్రామం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వెంకట్రావుపేట ఎక్స్ రోడ్ వద్ద తనిఖీలు చేపట్టారు.
ఓ టాటా సుమో వాహనాన్ని తనిఖీ చేయగా 9 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. పోలీసులు బియ్యాన్ని స్వాధీనంచేసుకొని ఒకరి పై కేసు నమోదు చేసివాహనాన్ని సీజ్ చేశారు. ఎవరైనా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.