సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
24 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత
దహెగాం, జూన్ 27 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా కలిగిస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ 6.64 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన వా రు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే ప్ర భుత్వం ఆర్థిక సాయం మంజూరు చేస్తుందన్నా రు. అదేవిధంగా చిన్నరాస్పల్లి నుంచి అమర్గొం డ వరకు రూ 6 కోట్లతో బీటీ రోడ్డు, కొంచవెల్లి నుంచి చంద్రపల్లి వరకు రూ .6 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రసాద్రాజ్, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
కాగజ్నగర్లో 40 మందికి..
కాగజ్నగర్ టౌన్, జూన్ 27: పట్టణంలోని క్యాం ప్ కార్యాలయంలో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్నగర్ మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ. 14,84,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయన్నారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్ కుమార్, వ్యవసాయ మా ర్కెట్ చైర్మన్ కాసం శ్రీనివాస్, కౌన్సిలర్లు పిర్సింగుల జైచందర్, వలీ, ఎల్లేశ్, సుజాత, బంకశివ, టీఆర్ఎస్ నాయకులు వనమాల రాము, సంతర్ పాల్గొన్నారు.
దండేపల్లిలో ఎమ్మెల్యే దివాకర్రావు..
దండేపల్లి, జూన్ 27 : మండలకేంద్రానికి చెందిన సల్లూరి యేసుకు మంజూరైన రూ.40వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆదివారం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారు సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోళ్ల రాజమల్లు, తదితరులు ఉన్నారు.