మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి
శ్రీరాంపూర్ ఓసీపీపై‘వృక్షారోపణ్ అభియాన్’
జీఎం సురేశ్తో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే దివాకర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
శ్రీరాంపూర్, ఆగస్టు 19: వనాలతోనే మానవ మనుగడ సాధ్యమని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఓసీపీపై జీఎం సురేశ్ ఆధ్వర్యంలో ‘వృక్షారోపణ్ అభియాన్’ ప్రారంభించగా, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్తో కలిసి ఆమె మొక్కలు నాటారు. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. సింగరేణి వ్యాప్తంగా ఈ ఏడాది 911 హెక్టార్లలో 55 లక్షల మొక్కలు నాటుతున్నామని, శ్రీరాంపూర్లో 66 హెక్టార్లలో 4.50 లక్షలు పెంచుతామని జీఎం చెప్పారు.
వనాల పెంపుతోనే మానవ మనుగడ సాధ్యమని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్తో కలిసి శ్రీరాంపూర్ ఓసీ జీఎం సురేశ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘వృక్షారోపణ్ అభియాన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్క నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మంచిర్యాల నుంచి గోదావరిఖని వరకు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీరాంపూర్లోని 66 హెక్టార్లలో 4.5 లక్షల మొక్కలు నాటనున్నట్లు ఇప్పటివరకు 3.3 లక్ష ల మొక్కలు నాటినట్లు జీఎం చెప్పారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దివాకర్రావును జీఎం సు రేశ్ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే నల్లాల ఓదెలు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్ర భాకర్, ఎస్వోటూ జీఎం హరినారాయణ గుప్తా, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనగురు రవీందర్రెడ్డి, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖాదీర్, ప్రాజెక్టు ఆఫీస ర్లు పురుషోత్తంరెడ్డి, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, ఈఈ కు మార్, ఏజెంట్లు విజయభాస్కర్రెడ్డి, ఏవీరెడ్డి, ఎంవీ నరసింహారావు, డీవైజీఎం చిరంజీవులు, నూక రమేశ్, ఓసీపీ మేనేజర జనార్దన్, నాయకులు మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎస్టీపీపీలో మొక్కలు నాటిన డైరెక్టర్
జైపూర్, ఆగస్టు 19: జైపూర్లోని ఎస్టీపీపీలో డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు 8వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ‘వృక్షారోపణ్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సంధర్భంగా విద్యుత్ కేంద్రం ప్రభావిత గ్రామాల ప్రజలకు వివిధ రకాల పండ్ల మొక్కలు అందించారు. అదేవిధంగా వి ద్యుత్ కేం ద్రంలో యూనిట్ రెండో వార్షిక మరమ్మతు పనుల ను గడువులోగా పూర్తి చేసిన అధికారులను అభినందించారు. సీటీసీ సంజయ్కుమార్ష్యూర్, చీఫ్ ఆప్ వోఅండ్ఎం జైన్సిం గ్, జీఎంలు శాస్త్రి, బస్వీరెడ్డి, డీజీఎంలు సముద్రాల శ్రీనివాస్, ప్రభాకర్తో సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
కైర్గూడ ఓసీపీలో ..
రెబ్బెన, ఆగస్టు 19: బెల్లంపల్లి ఏరియాలోని కైర్గూడ ఓసీపీలో ‘వృక్షారోపణ్ అభియాన్’ లో భాగంగా అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి జీఎం సంజీవరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏరియా ఎస్వోటూజీఎం సాయిబాబు, సర్పంచ్ ఆత్రం గంగారం, పీవోలు శ్రీనివాస్, చంద్రశేఖర్, డీజీఎంలు రాజేంద్రప్రసాద్, యోహన్, సతీశ్బాబు, పీఎం ఐ.లక్ష్మణ్రావు, డీవైపీఎం తిరుపతి, ఎన్వీరాన్మెంట్ అధికారి హరీశ్, ఫారెస్ట్ అధికారి నవీన్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.