నార్నూర్, జూన్14: వానకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిపెట్టు కొని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేడుతున్నా రు. గాదిగూడ మండలంలోని దాబా(కే), డొంగర్గావ్ గ్రామాల్లో గాదిగూడ ఎంపీవో సాయిప్రసాద్ సోమవారం పర్యటించారు. పారి శుధ్య పనులను పరిశీలించారు. పంచాయతీ సిబ్బందికి పలు సూచన లు చేశారు. మురుగుకాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, చెత్తాచెదారం నిత్యం తొలగించాలని సూచించారు. పంచాయతీ కా ర్యదర్శులు మార్ప సుభాష్, నిఖిల్, తదితరులున్నారు.
తాంసి, జూన్ 14: మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నారు. స్థానిక సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మురుగు కాలువల్లో పూడిక తీత, రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలిగించడం, నీటి క్లోరినేషన్ తదితర పనులను చేయిస్తున్నారు.
భీంపూర్, జూన్ 14: మండలంలోని భీంపూర్, కరంజి(టి), అర్లి(టి)(టి) తదితర గ్రామాల్లో సోమవారం మురుగు కాలువలను శుభ్రం చేయించారు. నీరు నిల్వ ఉండే స్థలాల్లో బ్లీచింగ్ చల్లించారు. సర్పంచ్లు మడావి లింబాజీ, జీ సాత్విక, జీ రమాబాయి, కార్యద ర్శులు సాయినందన, నితిన్, సందీప్ పనులు పర్యవేక్షించారు.
బోథ్, జూన్ 14: ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలని బోథ్ మండల పంచాయతీ అధికారి జీవన్రెడ్డి సూచించారు. సోమ రం బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలను సర్పంచ్ సురేందర్యాదవ్తో కలిసి సందర్శించారు. ఎంపీవో మాట్లాడుతూ.. వ్యాపారులు చెత్తను రోడ్లపై పడేస్తే రూ. వేయి జరిమానా విధిస్తామ న్నారు. సాయినగర్లో కొన్ని ఇళ్ల ఆవరణలో పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగినా తొలిగించుకకోకపోవడం సరికాదన్నారు. ఐదురోజుల్లోగా తొలిగించాలని సూచించారు. ఈవో సంజీవ్రావు, వార్డు సభ్యులు ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 14: వానకాలంలో కలుషిత నీరు తాగ కూడదని ఈవో సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ఫ కీర్ ఘట్ట వీధిలో బావిలోని అపరిశుభ్ర నీరు మోటర్ ద్వారా తొలి గించి బ్లీచింగ్ పౌడర్ వేసి క్లొరినేషన్ చేయించినట్లు పేర్కొన్నారు. ప రిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి మలేరియా, డెంగీ లాం టి వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచు కోవాలని గ్రామస్తులకు సూచించారు. జీపీ కార్మికులు ఉన్నారు.