బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కాసిపేట్ ఒకటో గనిపై గేట్ మీటింగ్కు హాజరు
పాల్గొన్న టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి
యూనియన్లో 100 మంది కార్మికుల చేరిక
కాసిపేట, ఆగస్టు 13 : రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక కల్లు తాగిన కోతిలా గంతులు వేస్తున్నాడని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట ఒకటో గనిపై శుక్రవారం టీబీజీకేఎస్ గేట్ మీటింగ్ నిర్వహించారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజరెడ్డితో కలి సి ఆ యన హాజరై ప్రసంగించారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడు తూ దేశంలో ఏ కంపెనీలో లేనివిధంగా సింగరేణిలో కార్మికుల హక్కులు అమలవుతున్నాయంటే అది సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్తోనే సాధ్యమైందన్నారు. హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు.
హక్కుల సాధనలో ముందు: మిర్యాల రాజిరెడ్డి
కార్మికుల హక్కుల సాధనలో టీబీజీకేఎస్ ముందుంటుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సింగరేణిలో సాధించిన హక్కులను జాతీయ సం ఘాలు ఇతర రాష్ర్టాల్లో కూడా అమలు చేయాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్తోనే కారుణ్య నియామకాలతో సింగరేణిలో కొత్త శకం ప్రారంభమై కార్మికులతో కళకళలాడుతుందన్నారు. అనంతరం ఆయా సంఘాల నుంచి కార్మికులు టీబీజీకేఎస్లో చేరగా వారి కి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్మికులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మిర్యాల రాజరెడ్డిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సెంట్రల్ ఉపాధ్యక్షుడు బడికల సంపత్, ఏరియా కార్యదర్శులు వొడ్నాల రాజన్న, మేడ సమ్మ య్య, పిట్ కార్యదర్శులు దుగుట శ్రీనివాస్, కారుకూరి తిరుపతి, చొల్లంగి శ్రీనివాస్, భైరి శంకర్, కార్మికులు పాల్గొన్నారు.
కండ్లముందే అభివృద్ధి : మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల్లలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, అయినప్పటికీ ఇవి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి కనిపించడం లేదా..? మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నడిపెల్లి ట్రస్టు చైర్మన్ విజిత్రావుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మారుమూల ప్రాంతాల్లో సైతం ఎకరా భూమికి రూ. 50 వేలు నుంచి లక్ష ధర మాత్రమే ఉండేదని, ఇపుడు సాగునీటికి ఇబ్బందుల్లేకుండా కావడంతో భూముల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ హాయాంలోనే ఇంద్రవెల్లిలో అమాయకులను చంపిన చోటనే సభపెట్టి వారి కోసం మాట్లాడడం దారుణమన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు స్టేజీ మీద ఉండగానే దొరల పాలనను అంతమొందిస్తానని, రావులను బొందపెడతానని రేవంత్ అన్నప్పటికీ ప్రేంసాగర్రావు మాట్లాడకపోవడం విచారకరమన్నారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ 18 ఏళ్లు కేసీఆర్తో ఉండి పదవులు అనుభవించి డబ్బు సంపాదించి మెడికల్ కాలేజీ, హ్యాచరీలు ఏర్పాటు చేసుకున్నాడని, సీఎం కావాలన్న ఆలోచనతో ఇప్పుడు ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్నాడని అన్నారు. హుజురాబాద్లో గెలుపు టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ నాయకులు అత్తి సరోజ, మామిడిశెట్టి వసుంధర, గాదెసత్యం, గోగుల రవీందర్రెడ్డి, గొంగళ్ల శంకర్, సందెల వెంకటేశ్, సుంకరి రమేశ్, అశోక్తేజ, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.