ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
పాల్గొన్న ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్, కలెక్టర్, పీవో, ఇన్చార్జి ఎస్పీ, ఎమ్మెల్యేలు
న్యూస్నెట్వర్క్, ఆగస్టు 9: ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసులకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాట యోధుడైన కుమ్రం భీంకు ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ జోడేఘాట్లో నివాళులర్పించారన్నారు. ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేకంగా ఐటీడీఏ ద్వారా నిధులు వెచ్చించి మెరుగైన విద్యతో పాటు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో జాడి రాజేశ్వర్, ఐటీడీఏ డీడీ, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, సార్మేడీ జిల్లా అధ్యక్షుడు మెస్రం దుర్గు, ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కేంద్రంలో ని ఎమ్మెల్యే నివాసంలో ఆదివాసుల ఆరాధ్యదైవం, గిరిజన పోరాటయోధుడు కుమ్రంభీం చిత్ర పటానికి ఎమ్మెల్యే రాథో డ్ బాపురావ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఖానాపూ ర్, బోథ్ నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో ఆది వాసులు, ఆదివాసీ నాయకులు కుమ్రంభీంకు నివాళులర్పించారు.