రక్త హీనత నివారణకు కృషి చేయాలి
అధికారులతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జూన్ 1 : జిల్లాలో రక్త హీనత, ఇతర అనారోగ్య సమస్యలతో గర్భిణులు, బాలింతలు మృతి చెందకుండా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలల్లో రక్తహీనత నుంచి గర్భిణులు బయట పడేలా అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సీడీపీవోలు క్షేత్ర స్థాయిలో పనిచేయాలన్నారు. పౌష్టికాహార లోపం తో బాధపడుతున్న పిలల్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి సావిత్రి, ఉపాధికల్పనాధికారి రవికృష్ణ, అన్ని ప్రాజెక్టుల సీడీపీవోలు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
మహిళా చైతన్య కార్యక్రమాల్లో భాగంగా సైబర్క్రైమ్ను నియంత్రించేందుకు సంబంధిత ఐపీసీ సెక్షన్లపై ప్రతి ఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అ న్నారు. సఖీ కేంద్రం ఆధ్వర్యంలో పోస్టర్ను కలెక్టరేట్లో ఆయన మంగళవారం ఆవిష్కరించారు. సైబర్ క్రైమ్కు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళా చట్టాలపై విద్యార్థినులు, మహిళలకు తెలిపేలా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పోస్టర్లను అంటించాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి సావిత్రీబాయి. సీడీపీవోలు సాదియా, విజయలక్ష్మి, సురేఖ, సఖీ కేంద్రం నిర్వాహకులు సౌజన్య, కౌన్సిలర్ సుమలత, సంబంధిత శాఖల అధికారులు, సఖీ కేంద్ర సిబ్బంది ఉన్నారు.