ఎదులాపురం, డిసెంబర్ 21 : గాదిగూడలో ఈ నెల 26వ తేదీన నిర్వహించే కుమ్రం భీం విగ్రహావిష్కరణ, మహాసభను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మంగళవారం విగ్రహావిష్కరణకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరప భరత్, వెట్టి మనోజ్, మెస్రం శేఖర్బాబు, ప్రకాశ్, నాగ్నాథ్, గోవింద్, దినేశ్, గాదిగూడ మండల పటేల్ ఆత్రం నాగోరావ్ పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
గాదిగూడలో ఈ నెల 26వ తేదీన నిర్వహించే కుమ్రం భీం విగ్రహావిష్కరణ, మహాసభను విజయవంతం చేయాలని ఎంపీపీ చంద్రకళ రాజేశ్వర్, సర్పంచ్ మెస్రం జైవంత్రావ్, ఆత్రం నాగోరావ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కుమ్రం భీం మనుమడు సోనేరావ్, దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ సోయం బాపురావ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, జోగు రామన్న, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, మాజీ ఎంపీ నగేశ్, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి, ఇంద్రవెల్లి మార్కెటింగ్ కమిటీ వైస్చైర్మన్ తొడసం నాగోరావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, ఐటీడీఏ పీవో అంకిత్కుమార్, నార్నూర్ సీఐ ప్రేమ్కుమార్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించామని తెలిపారు. ఆదివాసీ తొమ్మిది తెగల కుల పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.