కడెం, డిసెంబర్ 12 : నియోజకవర్గ అభి వృద్ధికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పేర్కొన్నారు. మంగళవారం కడెంతో పాటు, పలు గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా కడెంలో బీఆర్ అంబేద్కర్, ఇందిరాగాంధీ, కుమ్రంభీం విగ్రహా లకు పూలమాల వేసి, నివాళులర్పించారు. అనం తరం ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహిం చారు. ఎంపీపీ అంథోని అలెగ్జాండర్, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, నాయకులు భూషణం, రాజేశ్వర్, జడ ఇందూర్నేత, పడిగెల రాజనర్సయ్య, వాజీద్, మహమూద్, పొద్టుటూరి సతీశ్రెడ్డి, సంపత్రెడ్డి, నరేందర్రెడ్డి, తక్కళ్ల సత్యనారాయణ, కన్నె శ్రీనివాస్, పాకనాటి రాజే శ్వర్, బైరి గంగారాజం, నాయకులు, తదితరులు న్నారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును మండల అధికా రులు, ప్రజాప్రతినిధులు కలిసి సన్మానించారు. ఎంపీపీ అంథోని అలెగ్జాండర్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో ఉపేందర్, ఈజీఎస్ ఏపీవో జయదేవ్, సిబ్బంది, తదితరులున్నారు.
నిత్యం అందుబాటులో ఉంటా..
పెంబి, డిసెంబర్ 12 : ప్రజలకు నిత్యం అందు బాటులో ఉండి అభివృద్ధ్దికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పేర్కొన్నారు. పెంబిలో ఎమ్మెల్యే పర్యటించారు. వివిధ సంఘాల నాయ కులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు ఎమ్మె ల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమను కలువాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీ లించారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కాంగ్రెస్ మండల అధ్య క్షుడు సల్లా స్వప్నిల్ రెడ్డి, నాయకులు తులాల శంకర్, గుగ్గిళ్ల భూమేశ్, తోకల మహేందర్, మల్లపల్లి స్వామి, దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన డీఎస్పీ నాగేందర్
ఉట్నూర్, డిసెంబర్ 12 : పట్టణానికి వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యేగా వెడ్మాబొజ్జు పటేల్కు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తన సిబ్బందితో కలి శారు. సీఐ రామకృష్ణ, ఉట్నూర్ ఎస్ఐ మనోహర్, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్లు ఉన్నారు.