ఇంద్రవెల్లి : ప్రతీ గ్రామం స్వచ్ఛ గ్రామాలుగా మారాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో అధికారులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని అధికారులతో కలిసి రోడ్లను ఊడ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా మారడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మనం, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో ప్రతీ గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ రాఘవేందర్రావు, ఎంపీడీవో పుష్పలత, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ సందీప్, ఈవో శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.