శ్రీరాంపూర్, ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ ఉద్యమ కారుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శ్రీరాంపూర్ కాల నీ నుంచి 200 మంది కార్యకర్తలతో పెద్దపల్లికి తరలిన ఆయన, బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, చందర్, మనోహర్రెడ్డి సమక్షంలో టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మి ర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో 200 మందితో కలిసి బీఆర్ఎస్, టీబీజీకేఎస్లో చేరారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెట్టం లక్షణ్, బండి రమేశ్, పానగంటి సత్తయ్య, పుప్పాల సంపత్, తొంగల రమేశ్, అన్వేష్రెడ్డి, సాదుల భాస్కర్, పొగాకు రమేశ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, సాయి, శ్యాంకుమార్, ఉత్తేజ్రెడ్డి, దినాకర్, నిరీక్షణ్, రమణారెడ్డి, జయపాల్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కోల్బెల్ట్ ప్రాంతం నుంచి కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధించుకున్నాం. సింగరేణిలో రెండుసార్లు టీబీజీకేఎ స్ గుర్తింపు కార్మిక సంఘంగా గెలవడంలో ముఖ్య భూమిక పోషించాను. యూనియన్ ఎన్నికల సమయంలో ఐఎన్టీయూసీలో చేరాను. కానీ అందులో ఉద్యమ కారులకు స్థానం లేదని గ్రహించాను. అందుకే తిరిగి సొంత పార్టీలోకి వచ్చాను. రెండుసార్లు ఎంపీటీసీగా, టీడీపీ జిల్లా కార్యదర్శిగా పనిచేశాను.