‘కాంగ్రెస్ నాయకులూ.. ఒక్క చాన్స్.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ వంగి వంగి దండాలు పెడుతున్నరు. ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి.. గిప్పటికే పదకొండు సార్లు ఇచ్చాం.. ఏం వెలుగబెట్టిన్రు. మాకు ఒక్క పనిజేయలే. అసలు పట్టించుకోలే. పైగా కక్ష గట్టి ఎరువులు, విత్తనాలు, సామగ్రి ధరలు పెంచి అప్పులపాలు జేసిన్రు. కోలుకోలేని దెబ్బతీసిన్రు. ఎవుసం అంటేనే విరక్తి చెందేలా చేసిన్రు. ఏడు గంటల కరెంటిచ్చి సావులకు కారణమైన్రు. గిప్పుడేమో ఎలచ్చన్లు వచ్చినయని మూడు గంటలే సరిపోతదని సన్నాయి రాగాలు పలుకుతుండ్రు.
అసలు మీది ఎద్దు, ఎవుసం తెలిసిన ముఖమేనా.. కేసీఆర్ సారు 24 గంటలు ఉచితంగా కరెంటివ్వడంతో వ్యవసాయం పండుగైంది. ప్రతి ఇల్లు ధాన్యపురాశులతో కళకళలాడుతున్నది. ఇగ, మనం వాడేది 3,5 హెచ్పీ మోటర్లే. మీరేమో 10 హెచ్పీ పెట్టుకోమంటున్నరు. 10 హెచ్పీ మోటర్లు మన వద్ద ఎవుసానికి ఎక్కడైనా వాడుతున్నరో చూపించున్రి. దానితో నష్టాలు తెలుసా? పెట్టుకోమనంగనే సరిపోతదా.. అవగాహన లేకుండా ఇంకోసారి మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం.. మీరు గెలిచేది లేదు.. సచ్చేది లేదు..’ అని రైతన్నలు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నరు. ఈ క్రమంలో ‘నమస్తే’ ప్రత్యేక కథనం రైతుల అభిప్రాయాలతో..
– ఆదిలాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ)
తాంసి, నవంబర్ 22 : నా పేరిట ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. యేటా పత్తి, సోయా, కంది వేస్తా. చేలకు బోరు బావి ద్వారా నీరందిస్తా. కాంగ్రెస్ పాలనలో ఏడు గంటల కరంటని ఇచ్చేటోళ్లు. ఇందులో మూడు గంటలు పగలు, నాలుగు గంటలు రాత్రి ఇచ్చేవాళ్లు. రాత్రిపూట మాత్రమే త్రీఫేజ్ కరెంటు ఇవ్వడంతో చేలకు నీరందించడానికి అవస్థలు పడేవాళ్లం. భయం భయంగా వెళ్లి నీరు పెట్టేది. గిప్పుడేమో మళ్లా కాంగ్రెసోళ్లు మూడు గంటలే సాలంటున్నరు. అప్పుడే నాలుగు గంటలు సరిపోలేదు. గిప్పుడు ఎలా సాలుతదని అంటున్నరో అర్థం కావడం లేదు. నేను 3 హెచ్పీ మోటర్తో చేనుకు పారకం అందిస్తా. నాకు 10 హెచ్పీ మోటర్ ఎందుకు? గిప్పుడు నాకున్న మోటర్ను తుక్కుకు అమ్మి, లచ్చ రూపాలు పెట్టి పెద్ద మోటర్ కొనాల్నా. కాంగ్రెసోళ్లు మాట్లాడితే అర్థం ఉండాలి. దీనంతటి కంటే కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు బాగున్నది.
– దుబ్బాకుల పార్వతి, మహిళా రైతు,
ఆదిలాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : రైతులపై లక్షల రూపాయల ఆర్థిక భారం మోపి, అప్పుల ఊబిలోకి నెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని రైతులు మండిపడుతున్నరు. మూ డు గంటల కరెంట్ సరిపోతదని మేం చెప్పినమా.. 10 హెచ్పీ మోటార్లు కావాలని అడిగినమా.. అని నిలదీస్తున్నరు. మాకు తెలిసినంత వరకు వ్యవసాయానికి 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు సరిపోతాయంటున్నరు. 10 హెచ్పీ మోటర్లు పెట్టి దానికి కావాల్సిన పైపులు, వైర్లు, స్టార్టర్లు అన్ని కొత్తవి కొనాల్సిందేనని, వీటన్నింటికీ లక్ష రూపాయల కంటే ఎక్కువ అవుతుందని చెప్తున్నరు. అంత మొత్తం కావాలంటే అప్పు తేక త ప్పదని.. కోరికోరి కొరవితో తల గోక్కోవాలా అని ప్రశ్నిస్తున్నరు.
వ్యవసా యం ఎట్లా చేయాలే మాకు తెలుసునని.. ఆ కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలు వింటే కరెంట్ కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నరు. 24 గంటలకు బదులు 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తమన్నందుకా.. 10 హెచ్పీ మోటర్లతో ముమ్ములను ముంచాలని కుట్ర లు చేస్తున్నందుకా.. ఎందుకు అవకాశం ఇ వ్వాలని ప్రశ్నిస్తున్నరు. పెద్ద మోటరు పెడితే బావులు, బో ర్లలో నీరు త్వరగా అడుగంటుతాయని, మూడు గంటలు మాత్రమే వచ్చిపోయే కరెంట్తో మోటర్లు కాలిపోతయంటున్నరు. అ దే జరిగితే నీటి కోసం ఏడవక తప్పదని, మోటర్ల రిపేర్లకు, కూలీలకు ఖర్చు తప్పదని ఆవేదన చెందుతున్నరు. కాం గ్రెస్ కరెంట్ కుట్రల పై రైతులతో మాట్లాడి ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 22: మా కుటుంబా నికి తంతోలి శివారు లో రెండెకరాల భూ మి ఉన్నది. ఇందు లో పత్తి, కంది పం టలు తీస్తున్నం. ఇ ప్పటివరకైతే 3 హెచ్ పీ మోటర్నే వాడు తున్నం. దీంతోనే పంటకు నీటి తడులిస్తున్నం. గతంలో రైతులు కరెంటు బిల్లులు కట్టలేకనే నీటి తడులు ఇవ్వడానికి వెనకాముం దూ చేసేది. ఇగ ఎప్పుడూ ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలి పోయేది. వీటిని మంచిగ చెపియ్యాలంటే వడ్డీకి పైసలు తెచ్చుడయ్యేది. ఇప్పుడిప్పుడే రైతులు ఈ అప్పుల నుంచి బయటపడుతున్నరు. ఇగ మళ్లీ కాంగ్రెసోళ్లు వస్తే అప్పుల కోసం తిరగాల్సి వస్తది. వీళ్లు ఒక్క పైస కూడా సాయం ఇయ్యరు. మీదికెళ్లి రైతుల నుంచే వసూలు చేస్తరు. కాంగ్రెసోళ్లతో ఎవుసం చేయిస్తే తెలుస్తది రైతుల కష్టం. .
– దొనె అశోక్, రైతు, తంతోలి
సొనాల, నవంబర్ 22 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులను తీసుకు వచ్చేందుకు కుట్ర పన్నుతున్న ది. సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్, రైతుబం ధు, రైతు బీమా పథకాలతో రైతులను ఆదుకోంటున్నారు. మా బతుకులు బాగుండడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటలకరెంట్తోనే 10 హెచ్పీ మోటర్లతో పొలా నికి నీటిని పారించవచ్చని రేవంత్రెడ్డి చెప్పడం అ వివేకం. కాంగ్రెస్ హయాం లో కరెంట్ కోసం గోసలు పడ్డం. ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ రోడ్డెక్కి కరెంట్ కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న 24 గంటల కరెంట్తో అవసరం ఉన్నప్పుడువెళ్లి పంటలకు నీరంది స్తున్న. నాకున్న ఐదెకరాల పొలంలో పత్తి, సోయా పంటలు పండిస్తున్న. వ్యవసాయం మీద అవగాహన లేని కాంగ్రెస్ నాయకులకు రైతుల పని, వారి అవసరాల గురించి ఎలా తెలుస్తాయి. అందుకే 24 గంటల కరెంట్ సరఫరా చేసే సీఎం కేసీఆర్ సార్కు అండగా ఉంటం. కాంగ్రెసోళ్లను నమ్మితే నిండా మునుగుతాం.
– తుల హరీశ్, రైతు (సొనాల)
నార్నూర్, నవంబర్ 22: గిప్పుడు ఎప్పుడు కటుకేస్తే గప్పుడే నీళ్లస్తున్నయ్. 24 గంటల కరెంట్ ఉంటున్నది కాబట్టే గిట్లయితున్నది. ఇగ కాంగ్రెసోళ్లు మూడు గంటలే కరంట్ ఇస్తే ఇగ స్విచ్చు బోర్డు కాన్నే కావలుండాలె. మళ్లీ పాత రోజులను తెస్తనని రేవంత్ రెడ్డి అంటున్నడు. లేదు మీ బతుకులు బాగు చేస్తనని కేసీఆర్ అంటున్నడు. మరి కాంగ్రెసోళ్లు మనకెందుకు. వీళ్లు గతంలో మనల్ని ఎట్ల చూసిన్రో గప్పుడే మర్చిపోతమా.. వీళ్లిచ్చే మూడు గంటల కరెంటుతోని ఇగ మల్లా మన బతుకులు ఆగమైతయ్. నాకు ఐదెకరాల భూమి ఉన్నది. గతంలో కరెంట్ కోసం ఎదురు చూసేటోళ్లం. గిప్పుడు ఆ పరిస్థితి లేదు. కరెంట్ కోతల్లేవు. రెండు,మూడు రోజులు చేసే పనిని ఒకే రోజు పూర్తి చేస్తున్నం. అందుకే కరెంటిస్తున్న పార్టీ వైపే మేముంటం.
మాన్కాపూర్ వ్యవసాయయ పొలంలో పోరుబావి నుంచి వద్ద రాయిసిడాం రూప్దేవ్
బజార్హత్నూర్, నవంబర్ 22 : మా పొలంలో 3 హెచ్పీ మోటర్ వాడి పంట లు పండిస్తున్నాం. రేవంత్రెడ్డి చెప్పినట్లు 10 హెచ్పీ మోటర్ వాడితే చాలా సమ స్యలు వస్తాయి. కరెంట్ లోడ్ ఎక్కువ అయితది. విద్యుత్ సరఫరాకు అంత రాయం ఏర్పడుతుంది. పొలాలు ఎండిపోతాయి. రైతు వ్యతిరేక విధానా లను కాంగ్రెస్ అవలంబిస్తున్నది. రైతులందరూ వారికి తగిన బుద్ధి చెబుతరు. కాంగ్రెస్పార్టీని పాతాళంలోకి తొక్కేస్తారు. రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉండాలంటే మళ్లీ బీఆ ర్ఎస్ను గెలిపించాలె.
-కిర్తీ సాయవ్వ, బజార్హత్నూర్
బోథ్, నవంబర్ 21: మాకు ఎనిమిదెకరాల భూ మి ఉన్నది. దీనికి పూర్తిగా సాగునీటి సౌకర్యం ఉంది. బోరు బావికి మోటరు పెట్టుకొని పంటలకు నీటి తడులు ఇస్తున్నం. గిప్పుడు 24 గంటల ఉచిత కరెంట్తోనే రెండు పంటలకు అవసరమున్న సమయంలో నీటిని పారిస్తున్నం, ఇగ కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంట్ అంటే మా భూము లు తడిసినట్లే. వాళ్లు ఆ మూడు గంటలు సక్కగా ఇయ్యలేరు. వాళ్లను నమ్ముకుంటే ఇగ అంతే. టెన్ హెచ్పీ మోటరు పెట్టుకొమ్మని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నరు. వీళ్లకసలు ఎవుసం అంటే తెలుసా అనే డౌటు వస్తున్నది. వీళ్లకు రైతులంటే కనీసం ప్రేమ లేదు. గతంలో కూడా గిట్లనే చేసిన్రు.
– మార కిరణ్ కుమార్ రెడ్డి ధన్నూర్ బీ.
ఉట్నూర్, నవంబర్ 22 : తెలంగాణ అచ్చినంక ఆర్థికంగా ఇబ్బందులన్నీ పోయినయ్. వానలు పడకపోయినా గిప్పుడు బోర్లతోని నీళ్లిచ్చుకుంటున్నం. 24 గంటల కరంటు ఉండవట్టి అది సాధ్యమైంది. యాసంగిలో కూడా ఎలాంటి రంది లేకుండా పంటలు పండిస్తున్నం. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు సరిపోతుందని అంటున్నరు. గతంలో వీళ్ల ప్రభుత్వాలు చెయవట్టే వ్యవసాయం దండుగ అనిపించేది. గిప్పుడిప్పుడే ఎవుసం పండుగైంది. మళ్లా వీళ్లు వస్తే ఇగ ఉన్నది పోతది.. కష్టాలన్నీ మీద పడుతయ్. రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు అందరం మద్దతుగా నిలువాలె. ఆయనొస్తనే రైతులకు మేలైతది.
– చందనగిరి రాజేశ్వర్, కొత్తగూడ
గుడిహత్నూర్, నవంబర్ 22 : కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి కరెంట్తో కష్టాలు తీరి మూడు పంటలు పండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవ సాయానికి మూడు గంటలు కరెం ట్ చాలు అంటున్నడు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్తో మూడు గుంటల మడి కూడా పారదు. 24 గంటల కరెంట్తో పంటలు పండిస్తుంటే, మళ్లా ఎవుసం బంద్ చేపియాని వీళ్లు చూస్తున్నరు. నాకున్న రెండెకరాల పొలంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా పొ లంలో పత్తి, కూరగాయలు సాగు చేసుకుంటున్న. కాంగ్రెసోళ్ల మా టలు నమ్మే స్థితిలో రైతులు లేరు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వే సి కేసీఆర్ను మళ్లీ సీఎంను చేసేందుకు రైతులమంతా సిద్ధంగా ఉన్నాం.
– సాతాలే గోవింద్, రైతు, గుడిహత్నూర్
ఇంద్రవెల్లి, నవంబర్ 22: కాంగ్రెసోళ్లు 24 గంటల కరంట్ అస్సలియ్యరు. మల్లా కటిక చీకట్ల కాలం తెస్తరు. వీళ్లకు జనాలెట్ల పోయినా పట్టింపుండదు. గతంలో ఎన్ని ఇ బ్బందులు పడ్డం. వాటినే ఇంకా మర్చిపోలె. రాత్రుళ్లు బావుల కాడ నిద్ర లేని రోజులు ఎ న్నో ఉన్నయ్. ఇగ మళ్లీ వీళ్లను తెచ్చి నెత్తిమీద పెట్టుకుంటే ఏమైతదో అందరికీ తెలుసు. ఎవుసం భూముల్లో బోరుబావులను ఏర్పా టు చేసుకొని రెండు రకాల పంటలు పండిస్తు న్నం. కాంగ్రెసోళ్లు గిప్పుడు లేని పోని మాట లు మాట్లాడుతున్నరు. వీళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు గని ఉట్టిగ రైతులను గిప్పుడే భయపెడుతున్నరు. అసలు రైతులెవ్వరూ కాంగ్రెస్ ను పట్టించుకుంట లేరు.
– ఆత్రం ధర్ము, రైతు, మోడిగూడ
ఉట్నూర్, నవంబర్ 21: తెలంగాణ అచ్చినంకనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నది. కాం గ్రెసోళ్లు 3 గంటలు కరెంటు సాలని అంటున్నరు. వాళ్లు వస్తే మల్లా పాత కథే మొదలైతది. కరంట్ సక్కగ ఇయ్య రు. మూడు గంటల కరంటుకు పొలమంతా తడవాలం టే రోజులు పడుతది. వాళ్లు చెప్పినట్లు టెన్ హెచ్పీ మో టర్ కొనాల్నంటే ఇగ మళ్లీ అప్పుల కోసం తిరగాల్సి వస్తది. ఇగ దళారుల రాజ్యం గిక్కడే మొదలైతది. కాం గ్రెసోళ్లంటనే దళారుల రాజ్యం. మళ్లీ ఆ రాజ్యం కోసం వాళ్లు ప్రయత్నిస్తరు. అందుకే రైతు రాజ్యం ఉండాల్నా.. దళారుల రాజ్యం ఉండాల్నా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలె.
– భీంరావు, తేజాపూర్
ఇచ్చోడ, నవంబర్ 22: కొన్నేండ్ల సంది రైతులు ఏ రంది లేకుండా బతుకుతున్నరు. పెట్టుబడి సాయం, 24 గంటల కరంటు, రుణమాఫీ ఇవన్నీ చెయ్యవట్టి ఏదో కు టుంబాలను ఇంత తీర్చిదిద్దుకుంటున్నరు. ఇగ గిదే కళ్ల మంట అయినట్లున్నది. కాంగ్రెసోళ్లు మళ్లీ లొల్లి షురూ జే సిండ్రు. 3 గంటల కరెంటు సాలు అంటున్నరు. ఇప్పటిదా కా మా ఊళ్లే పొలాల కాడ వాడేటియి 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే. ఇగ ఆ కాంగ్రెస్ పెద్దమనిషి టెన్ హెచ్పీ మోటర్ పెట్టుకోవాలె అంటున్నడు. అస్సలు ఆ పెద్ద మనిషికి ఎవు సం అంటే తెలుసా.. ఎంత ఖర్చయితది.. ఎంత ఇబ్బంద యితది.. రైతులెంత గోస పడుతరనేది ఏమన్న ఎరకున్న దా.. . ఈ మోటర్లను రైతులందరూ ఒకేసారి ఆన్ చేస్తే ట్రాన్మఫార్మర్లు కాలిపోతయి. మళ్లా వచ్చేది కేసీఆరే.
– సిద్ధవార్ అంబాజీ, అడిగాం(బీ)