మందమర్రి నవంబర్ 18: మందమర్రి పట్టణంలోని శ్రీసీతారామాలయం, శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయం ఆవరణలో శుక్రవారం రాత్రి రుద్రాభిషేకం, శివ కళ్యాణం, కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛరణతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధల తో నిర్వహించారు. అనంతరం మహిళలు, యువతులు ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించా రు.తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్ నల్లాల ఓదెలు, సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల లక్ష్మి, శ్రీనివాస్ దంపతులు, రామగుండం రీజియన్ రక్షణ విభాగం జీఎం జయశ్రీ సాంబయ్య దంపతులు, కేకే ఐదు గని మేనేజర్ కవిత భూశంకరయ్య దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున దేవతామూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్), టీబీజీకేఎస్, ఏఐటీయూ సీ నాయకులు జే రవీందర్, మేడిపల్లి సంపత్, బత్తుల శ్రీనివాస్, మిట్ట సూర్యనారాయణ, జీడి బాపు, తిరుపతి, సలేంద్ర సత్యనారాయణ, శ్రీపతి శంకరయ్య, కంది శ్రీనివాస్ పాల్గొన్నారు.