ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 19 : 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాజెక్టులు, ఆపరేషన్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, కమర్షియల్ డైరెక్టర్ సంధ్యారాణి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డితో కలిసి ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్స్టేషన్లను నిరంతరం పర్యవేక్షించాలని, లాగ్ పుస్తకాల్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా చూడాలని సూచించారు. 100 శాతం విద్యుత్ బిల్లులను వసూలు చేయాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ వాసుదేవ్, డీఈలు, ఎడీఈలు, ఏఈలు, ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.