బజార్హత్నూర్, డిసెంబర్ 20 : ఉపాధిహామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో కాండ్లీ-మోహద ప్రధాన రహదారికి నిర్మించిన గ్రావెల్ రోడ్డుకు బిల్లులు విషయంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని కాండ్లీ గ్రామస్తులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఏపీడీ మోసియొద్దీన్ మంగళవారం కాండ్లీ గ్రాహానికి వెళ్లి, గ్రామస్తులతో మాట్లాడారు.
రెండు కిలో మీటర్ల మేర వేసిన రోడ్డును పరిశీలించారు. నివేదికను ఉన్నతధికారులకు అందించి, బిల్లులు అందేలా చూస్తామన్నారు. అనంతరం మోహద గ్రామంలోని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల ఎదుగుదలకు కృషిచేయాలని నిర్వాహకులు, అధికారులకు సూచించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కాండ్లీ సర్పంచ్ శేఖర్రావు, ఏపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సౌందర్య, ఈజీఎస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.