కాగజ్నగర్, జనవరి 20 : కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్కుమార్పై శనివారం ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బందోబస్తు మధ్య కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఆపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 23 మంది కౌన్సిలర్లకుగాను.. 21 మంది కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ప్రిసైడింగ్ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. అవిశ్వాస తీర్మాన రిపోర్టును కలెక్టర్కు పంపిస్తామని, కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలతో పట్టణ అబివృద్ధి గాడితప్పిందని, మాజీ ఎమ్మెల్యే కోనప్ప సహకారంతో అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి మాజీ ఎమ్మెల్యే కోనప్పను మర్యాద పూర్వకంగా కలిశారు. కౌన్సిలర్లను ఆయన శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఏవో ప్రమోద్కుమార్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, సిబ్బంది క్రాంతి, బాపు ఉన్నారు.