కాగజ్నగర్, మార్చి 18 : ఇటీవల మృతి చెందిన సాయికుమార్ కుటుంబానికి న్యా యం చేయాలంటూ సోమవారం కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట అతడి బంధువులు, కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కాగజ్నగర్ మండలం నామనగర్కు చెందిన సాయి, ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. సదరు యువతికి వివాహ వయస్సు లేనందున పెండ్లి వాయిదా పడింది.
ఈ క్రమంలో సాయికుమార్ తన ప్రేయసి ఇంట్లోనే ఈ నెల 11న అనుమానాస్పదంగా మృతి చెందాడు. మెడపై గాట్లు ఉం డడంతో సాయిని యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిం దితులను నామమాత్రంగా అదుపులోకి తీసుకొని వదిలేశారని, వారం గడస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పట్టణ సీఐ శంకర్ జోక్యం చేసుకొని పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.