చెన్నూర్ టౌన్, డిసెంబర్ 30 : రాజీమార్గమే మేలని, త్వరగా కేసులు తేలే అవకాశం ఉంటుందని చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి పీ రవి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. 315 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
లక్షెట్టిపేట, డిసెంబర్ 30: పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా, జూనియర్ సివిల్ జడ్జి అసదుల్లా షరీఫ్ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్, ఏజీపీ పద్మ, సీనియర్ న్యాయవాదులు కేతిరెడ్డి భూంరెడ్డి, రాజేశ్వర్రావు, అక్కల శ్రీధర్, నళినీకాంత్, కూడెల్లి అశోక్, ప్రకాశం, గోవింద్రావు, ప్రదీప్, తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టీ), డిసెంబర్ 30: మండలకేంద్రంలోని సిర్పూర్(టీ) జూనియర్ సివిల్ కోర్టులో జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అజయ్ ఉల్లం పలు కేసులు పరిష్కరించారు. న్యాయవాదులు గణపతి, గంట కళ్యాణ్ పాల్గొన్నారు.