కన్నెపల్లి/తాండూర్/కెరమెరి/కౌటాల, ఫిబ్రవరి 11 : 11 తెగలైన మాలీ, వాల్మీకిబోయ, బేదర్, కిరాతక, నిషాధి, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, ఖయీతి లంబాడా, భాట్ మధురాలు, చమర్ మథురలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విషయం విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానం కాపీని కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. రాష్ట్ర సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా వర్గాలు సంబురాలు చేసుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమిని మండలాల్లో శనివారం మాలీ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తాండూర్ మండల వాల్మీకి బోయ సంఘం గౌరవ అధ్యక్షుడు ముస్కె సాగర్ ఆధ్వర్యంలో నాయకులు, కులస్తులు సుమారు 200 మంది తాండూర్ ఐబీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో మాలీ కులస్తులు సంబుర పడ్డారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్న మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. కౌటాల మండల కేంద్రంలోని మాలీ సంక్షేమ సంఘం భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చిత్ర పటాలకు మాలీ కులస్తులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బోనగిరి నిరంజన్ గుప్తా, నాయకులు నెండుగూరి వెంకన్న, నెండుగూరి సంతోష్, చంద్రుమేర, రాంమేర, తిరుపతమ్మ, కొట్రంగి శ్రీనివాస్, కొట్రంగి మధుకర్, శెండె తిరుపతి, నికోడె సురేశ్, ఒల్లేష్, జమ్మిషెట్టి గట్టుమళ్లు, ముస్క పోశం, జమ్మిశెల్లి లసుమయ్య, నూరుపతుల పోషం, ముస్కె రమేశ్, గుజ్జుల పోశం, అబ్బార్ల రాయమల్లు, గోగు శ్రీకాంత్, జమ్మిశెట్టి రాజం, ముస్క మల్లయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యదర్శి సెండే నారాయణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి లేన్గురే బాలాజీ, జిల్లా కమిటీ సభ్యుడు నాగోషే శివరాం, ఉపాధ్యక్షుడు ఆదే శ్యాంరావ్, ప్రచార కార్యదర్శి వాడై సోమ, నాయకులు ఆదే మనోహర్, లేన్గురే చందు, నాగోషే పోషెట్టి, మోహర్లే భీంరావ్, నాగోషే బుదాజీ, కెరమెరి మాలీ సంఘం మండలాధ్యక్షుడు కావుడే తులసీరాం, ప్రధాన కార్యదర్శి వాడై సుభాష్, మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదె వసంత్ రావు, మండల అధ్యక్షుడు నికాడే గంగారాం, సర్పంచులు శ్రీనివాస్, రమేశ్, నిహారిక, నాయకులు నాందేవ్, భీంరావు, శంకర్, రాము, గంగారాం, రమేశ్, గిర్మాజీ, మోతిరాం, నారాయణ, జైరాం, లక్ష్మయ్య ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది
కడెం, ఫిబ్రవరి 11 : వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. 1956లో తామంతా ఎస్టీలుగానే ఉన్నట్లు మా పెద్దలు చెబుతుంటారు. ఆర్థిక వెనకబాటుతో పాటు, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న మమ్ముల ఎస్టీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే 2016లోనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానంచేశారు. ఇప్పుడు మరోసారి తీర్మానం చేయడాన్ని చూస్తే సీఎం కేసీఆర్కు మాపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసి కేంద్రానికి పంపినా వివక్ష చూపుతుంది.
– తాటికొండ వెంకటేశ్, వాల్మీకి బోయ సంఘం మండల అధ్యక్షుడు, కడెం
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కడెం, ఫిబ్రవరి 11 : వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం శుభపరిణామమే. ఇందుకు కృతజ్ఞత లు. కానీ కేంద్ర ప్రభుత్వమే వివక్ష చూపుతూ వస్తున్నది. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ కాపీని కేంద్రానికి పంపింది. మరోసారి తీర్మానం చేసి పంపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికైనా కేంద్ర సర్కారు స్పందించాలి.
– వేల్పుల తిరుపతి, వాల్మీకి బోయ సంఘం మండల నాయకుడు, బెల్లాల్
అసెంబ్లీలో తీర్మానించడం హర్షించదగ్గ విషయం
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 11 : వాల్మీకి బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో కలిపేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయం. దాదాపు 12 ఏళ్ల క్రితం తమ కులాన్ని బీసీ-ఏ నుంచి ఎస్టీలో చేర్చాలని ఆందోళనలు చేశాం. అప్పుడే తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాం. చెల్లప్ప కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి కూడా సమర్పించింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీలో చేర్చాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానించినందుకు రుణపడి ఉంటాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 15వేల పైచిలుకు బోయ కులస్తులు ఉన్నారు. ఎస్టీ హోదా రాగానే వారందరికీ ఎంతో మేలు జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాను.
– ముష్కే పైడి, వాల్మీకి బోయ సంఘం, మందమర్రి పట్టణ అధ్యక్షుడు