మంచిర్యాల అర్బన్, జనవరి 27 : పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. మొత్తం 32 టీమ్లు పాల్గొననుండగా, ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకి రూ.20 వేలు, కప్, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకి రూ.15 వేలు, కప్, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకి రూ.10 వేలు అందచేయనున్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల సీఐ రాజు, ఎస్ఐ విజయ్కుమార్, ఆలయ ఫౌండేషన్ సీఈవో మిట్టపల్లి రాజేంద్రకుమార్, కార్యదర్శి మూగ మహేశ్, ట్రినిటీ హైసూల్ నిర్వాహకులు బిజూ కురివిల్లా, స్థానిక వార్డు కౌన్సిలర్ చైతన్య, సత్యపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బైరగోని సిద్దయ్య.
జిల్లా వ్యాయామ విద్య సంఘం ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాస్, జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైసూల్ ఇన్చార్జి హెచ్ఎం వల్లభ వెంకటేశ్వర్లు, టోర్నమెంట్ నిర్వాహకులు బొరే యాదగిరి, రావుల రామ్మోహన్, మంచిర్యాల సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు మురళి, లక్ష్మీనారాయణ, గురువయ్య,చిందం శ్రీనివాస్, రఘు, దీక్షిత్, మనీష్కుమార్, కృష్ణంరాజు, కృష్ణ, తిరుపతి, వేణు, రాజ్కుమార్, వీరేశం పాల్గొన్నారు.