నేరడిగొండ, ఫిబ్రవరి 2 : ఆటల పోటీలతో క్రీడాకారుల్లో స్నేహ భావాలు పెంపొందుతాయని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని శంకరాపూర్ గ్రామ యువకులు రోల్ మామడ గ్రామ సమీపంలోని గురు సాహెబ్ మందిరం వద్ద గురువారం కబడ్డీ టోర్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలు మంచి క్రీడాకారులను వెలికితీసేందుకు ఎంతో తోడ్పడుతాయన్నారు.
క్రీడలపై యువత ఆసక్తి చూపాలని సూచించారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని, ముందుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోలంకి గీత, ఉప సర్పంచ్ కైలాస్, నాయకులు మధన్, కరణ్సింగ్, చందర్సింగ్, ప్రతాప్నాయక్, కార్బరి లక్ష్మణ్ నాయక్, ఉపల్బీషన్, మేనేజ్మెంట్ డీజే రమేశ్, రాంచందర్, రాంసింగ్, రవి, అజయ్, రమేశ్, దినేశ్, సురేశ్, శ్రీను, గ్రామ యువకులు పాల్గొన్నారు.