ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 30: ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్(ఆర్ఎం) సుధా పరిమళ బదిలీ అయ్యారు.
ఆమె స్థానంలో సంగారెడ్డి డిప్యూటీ ఆర్ఎంగా కొనసాగుతున్న కే జానిరెడ్డి పదోన్నతిపై ఆదిలాబాద్ ఆర్ఎంగా రానున్నారు. కాగా, సుధా పరిమళ వరంగల్ ఆర్టీసీ శిక్షణ కళాశాలకు ప్రిన్సిపాల్గా స్థానచలనం పొందారు. ఇక్కడే యేడాదిపాటు కొనసాగారు.