నార్నూర్, మార్చి19: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధ్యాపకులకు సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ ఏకలవ్య గురుకుల పా ఠశాల, కళాశాలను ఆయన ఆదివారం సందర్శిం చారు విద్యార్థులు ఆనారోగ్యానికి గురవడంపై ప్రి న్సిపాల్ ఉపేందర్ను ఆరా తీశారు. వెంటనే వైద్యులతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆహారంలో మెనూ పాటించక పోవడంతోనే విద్యార్థులు ఆనారోగ్యని కి గురువుతున్నట్లు పిల్లల తల్లిదండ్రులు పీవో దృ ష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఐటీడీఏ పీవో మా ట్లాడుతూ..మెనూ అమలులో నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పకడ్బందీగా మెనూ అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. వా ర్డెన్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆర్సీవో గంగధార్ను ఆదేశించారు. ఇప్పటి నుంచి రుచికరమైన భోజనం వడ్డించాలని సూచించారు. అవ్వాల్ అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. పీవో వెంట అధ్యాపకులు ఉన్నారు.
మెరుగైన వైద్య సేవలు
విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాహుల్రాజ్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ ఆదేశాల మేరకు నార్నూర్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకు ల పాఠశాల, కళాశాలలో స్థానిక సీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. రిమ్స్ దవాఖానకు చెందిన వైద్య నిపుణులు సందీప్జాదవ్, రాహుల్, భరత్, ఇస్మయిల్ పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మందులు పంపిణీ చేశా రు. భయాందోళన అవసరం లేదని, పోషకాహా రం లోపంతోనే అస్వస్థతకు గురవుతున్నట్లు వై ద్యులు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యురాలు రాజమణి, హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, ఆరోగ్య పర్యవేక్షకుడు చౌహాన్ చరణ్దాస్, సిబ్బంది గోకుల్, శీల, సురేశ్ ఉన్నారు.