ఇంద్రవెల్లి, జనవరి 30 : కొలాం ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బు గుప్తా అన్నారు. మంగళవారం లిమ్గూడ గ్రామాన్ని సందర్శించారు. జీవన స్థితిగతులపై ఆరా తీశారు.
ప్రతి ఒక్కరు తమ ఆధార్కార్డును అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు.