జైనూర్ : పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో ( Tenth Results ) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల విద్యార్థులు జిల్లాలో టాపర్లుగా నిలవడం అభినందనీయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Laxmi ) అన్నారు. విద్యార్థులు పరచకి లోకేశ్వరి ( 542 ) మార్కులు, ఎం ఆర్థిక ( 537 ), ఏ,సంధ్యారాణి ( 535 ) అత్యధిక మార్కులు , బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించడంతో గురువారం ఆసిఫాబాద్ డీడీ రమాదేవి, పాఠశాల హెచ్ఎం పార్వతి, ఉద్యోగులతో కలిసి జిల్లా టాపర్లను శాలువలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందశాతం ఫలితాలు సాధించడం వెనుక విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి ఎంతగానో ఉందని అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆసిపాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, ఆసిఫాబాద్ డీటీడీవో రమాదేవి, జీసీడీవో శకుంతల, ప్రధానోపాధ్యాయురాలు ఆత్రం పార్వతి, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.