రైతుబంధు.. రైతుబంధు.. రైతుబంధు.. ఏ నోట విన్నా ఇదే మాట. ఏ నలుగురు కూడళ్లు, హోటళ్ల వద్ద కలిసినా ఇదే చర్చ. సీఎం కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో పెట్టుబడి సాయం గురించి విపులంగా వివరించడం, ప్రయోజనాలను తెలుపడం, అంతకు ముందు రైతన్న పెట్టుబడికి ఏవిధంగా ఇబ్బంది పడ్డాడో.. రైతుబంధు ఇచ్చినప్పటి నుంచి సంతోషంగా సాగు చేసుకుంటున్నాడో కూలంకషంగా వివరిస్తుండడంతో చర్చ మొదలైంది. కేసీఆర్ సారు చెప్పింది నిజమేనని, డబ్బులు ఇవ్వకపోతే పెట్టుబడికి కష్టమయ్యేదని రైతన్నలు పేర్కొంటున్నారు. అప్పో సప్పో చేసి సాగు చేస్తే పంట చేతికొచ్చాక సేటుకో, వడ్డీ వ్యాపారికో ఆ పంటను అమ్ముకోక తప్పేది కాదని, తీసుకున్న అప్పుకు వడ్డీ కలిపితే ‘అల్లికి అల్లి సున్నాకు సున్నా’ అయ్యేదని చర్చించుకుంటున్నారు. రైతుబంధు ఇచ్చినప్పటి నుంచి బాధలు తప్పాయని, ఇప్పటికీ పదకొండు సార్లు ఇచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ రూ.16 వేలు ఇస్తాడని, మాట తప్పడని పేర్కొంటున్నారు. కాగా.. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6,23,334 మంది రైతులకు రూ.8,349.03 కోట్లు అందించింది.
– మంచిర్యాల ప్రతినిధి/ ఆదిలాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ)
అప్పో సప్పో చేసి సాగు చేస్తే పంట చేతికొచ్చాక అప్పు ఇచ్చిన సేటుకో, వడ్డీ వ్యాపారికో ఆ పంటను అమ్ముకోక తప్పేది కాదు. తీసుకున్న అప్పుకు వడ్డీ కలిపితే ‘అల్లికి అల్లి సున్నాకు సున్నా’ అన్నట్లు రైతుకు దమ్మిడి కూడా మిగిలేదు కాదు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక గడిచిన తొమ్మిదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్తో బీడువారిన భూములు సాగులోకి వచ్చాయి. రైతుబంధు తెచ్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10 వేల ఇస్తున్నడు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నడు. అన్నింటికి మించి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నడు.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసింది సీఎం కేసీఆర్. రైతుల బతుకుల్లో వెలుగులు నింపిన రైతుబంధును కాంగ్రెస్ నాయకులు దుబారా ఖర్చు అనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ రైతుబంధు దుబారానా.. రైతుబంధు కావాల్నా.. వద్దా.. అడుగుతుంటే ఉండాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్తున్నారు. రైతుబంధు దుబారా అని, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని చెప్తున్న కాంగ్రెస్కు ఓటు వేసేది లేదని ఉమ్మడి జిల్లాలోని రైతులందరూ ముక్త కంఠంతో నినదిస్తున్నరు.
రైతుబంధు ఆలోచన చేసిందే కేసీఆర్ సర్కారేనని.. ఇప్పుడు రూ.10 వేలు ఇచ్చినా, రానున్న రోజుల్లో రూ.16 వేలు చేసినా అది వాళ్లతోనే సాధ్యమని, అందుకని మరోసారి బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని చర్చించుకుంటున్నరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 6,23,334 మంది రైతుల ఖాతా ల్లో 11 విడుతల్లో రూ.8,349.03 కోట్లు రైతుబంధు డబ్బులు జమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుబంధుపై రైతులతో మాట్లాడి ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
– మంచిర్యాల, నవంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 11, నమస్తే తెలంగాణ : నా పేరు రఘోత్తంరెడ్డి, మా ఊరు దహెగాం. నాకు పదెకరాల భూమి ఉంది. సర్కారోళ్లు రైతుబంధు కింద ఎకరానికి రూ. 5 వేల చొప్పున రూ. 50 వేలు ఇస్తున్నరు. ఇట్లా రెండు పంటలకు రూ. లక్ష నా ఖాతాలో వేస్తున్నరు. నేను ట్రాక్టర్ కోసం లోన్ తీసుకున్న. ఆరునెలలకోసారి కిస్తీ కట్టాలి. రైతుబంధు కింద వచ్చిన డబ్బులను గటే కడుతున్న. ఓ రకంగా చెప్పాలంటే సర్కారే నాకు ట్రాక్టర్ కొనిచ్చినట్లు.
పొలాలు దున్నితే వచ్చే డబ్బులను ఎవుసం కోసం వాడుకుంటున్న. మరోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు డబ్బులను రూ. 16 వేలకు పెంచుతమని సీఎం చెప్పిండు. ఆయన మాటిస్తే చేసి తీరుతడు. ఇది వరకున్న సర్కారోళ్లు రైతుల బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ లెక్క రైతులకు మేలు చోసినోళ్లను నేను ఇప్పటి దాకా చూడలేదు. బీఆర్ఎస్ గెలిస్తేనే రైతులు రంది లేకుంటా ఎవుసం చేసుకోవచ్చు. వేరే ఎవ్వరినీ నమ్మినా మోసపోవుడే అయితది. అందుకే మేమంతా బీఆర్ఎస్తోనే ఉంటం.
నాకు గ్రామంలో ఎనిమిదెకరాల భూమి ఉంది. గతంలో పంట పెట్టుబడులు లేక చాలా ఇబ్బందులు పడేటోళ్లం. ఏటా వానకాలం వచ్చిందంటే చాలు భయమయ్యేది. పంట పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలా అని ఆలో చించేవాళ్లం. దళారుల వద్ద ఎక్కువ వడ్డీతో అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు తెస్తుంటిమి. కొందరు రైతులు దుకాణాల్లో ఉద్దెరకు విత్తనాలు, ఎరువులు తీసుకువచ్చి పంట చేతికొచ్చినంక అమ్మి వడ్డీతో పాటు కట్టేటోళ్లు. అప్పులు ఇచ్చిన దళారులు పంటలను తమకే అమ్మాలని కండీషన్ పెట్టి తక్కువ ధర ఇచ్చేటోళ్లు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు పంట పెట్టుబడుల ఇబ్బందులు తప్పినయ్. రైతుబంధు పథకం కష్టాలన్నీ దూరం చేసింది.
ఎకరాకు రూ. 10 వేలు ప్రభుత్వమే సాగుకు సాయంగా ఇస్తున్నది. ఇప్పటి వరకు 11 సార్లు రైతుబంధు డబ్బులు వచ్చినయ్. నాకు ఏడాదికి రూ.80 వేల సాయం అందుతు న్నది. ఈ పైసలకు మాకు అవసరమైన మంచి విత్తనాలను కొనుగోలు చేస్తం. వర్షాలు పడగానే సకాలంలో విత్తనాలు వేస్తం. సరైన సమయంలో ఎరువులు వినియోగించ డంతో పంట దిగుబడులు బాగా వస్తున్నయ్. వానకాలం, యాసంగి పంటల సాగుకోసం పెట్టుబడుల ఇబ్బందులు లేకుండా సర్కారు మా బ్యాంకు ఖాతాల్లో సీజన్కు ముందుగానే పైసలు జమ చేస్తున్నది. రైతుబంధు పైసలతో మాకు ఎంతో మేలు జరుగుతున్నది.
– దశరథ్, రైతు, అంకోలి, ఆదిలాబాద్ రూరల్
నాపేరు కందుల వెంకటేశ్. మాది కోటపల్లి గ్రామం. నాకు ఏడెక రాల భూమి ఉంది. రైతుబంధు కింద రెండు పంటలకు కలిపి రూ. 70 వేలు వస్తున్నయ్. పంట పెట్టుబడికి రంది లేకుంటైం ది. తెలంగాణ రాకముందు ఎవుసం చేసేందుకు మస్తు తిప్పల పడ్డం. కరెంట్ ఉంటే నీళ్లు.. నీళ్లుంటే కరెంట్ ఉండకపోయే టిది. పెట్టుబడికి డబ్బుల్లేక సావుకార్ల సుట్టూ తిరిగేటోళ్లం. వడ్డీలకు తెచ్చి పంటలేసేటోళ్లం. ఎట్లనో అట్ల.. పంట తీస్తే అస్సలు.. మిత్తీ గాళ్లకే పోయేటిది. అరిగోస పడేటోళ్లం.
కొంద రైతే ఎవుసం ఇడిసిపెట్టి పట్టణాల పొంటి పనులకు పోయేటోళ్లు. తెలంగాణ వచ్చినంక రైతుల బతుకులు బాగుపడ్డయి. సర్కారు అనేక పథకాలు తీసుకొచ్చింది. రైతులకు తిప్పల్లేకుండా చేసిన్రు. గీ ఎవుసం చేసే నా బిడ్డకి పెండ్లి చేసిన. ఇంకో బిడ్డ.. కొడుకును మంచిగ చదివించు కుంటున్న. బీఆర్ఎస్ సర్కారు మళ్లోసారి గెలిస్తే రైతుబంధు డబ్బులను రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతమని అంటుంది. సీఎం కేసీఆర్ మాటిస్తే కచ్చితంగా చేస్తడు. గదే కాంగ్రెసోళ్లు న్యాయం చేస్తారన్న గ్యారంటీ లేదు. గందుకే రైతులందరం కలిసి మళ్లా కారు గుర్తునే గెలిపించుకుంటం.
– కందుల వెంకటేశ్, రైతు, కోటపల్లి