భైంసాటౌన్, జనవరి, 12 : మండలంలోని వానల్పాడ్ గ్రామానికి చెందిన ఎం బాబుకు సీఎం సహాయనిధి నుంచి రూ. 34 వేలు మంజూ రయ్యాయి. మంజూరైన చెక్కును గురువారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దేగాంలోని తన నివాసంలో లబ్ధ్దిదారుడికి అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని పేర్కొన్నారు. ముత్యంరెడ్డి, సాయారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భైంసా మండలంలో కుమ్మరి వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని దేగాం గ్రామంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని జిల్లా కుమ్మరి జాగృతి వెల్ఫెర్ సొసైటీ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో శిక్షణ కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అనంతరం సొసైటీకి సంబంధించిన క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్క రించారు. కార్యక్రమంలో కుమ్మరి జిల్లా సంఘం అధ్యక్షులు భూసారపు గంగాధర్, ప్రధాన కార్యదర్శి శనిగారపు అనిల్, కొత్తపల్లి రఘు, రాజారపు శ్రీనివాస్, ఆమెడ లింగన్న, కోటగిరి భోజన్న, ఆమెడ నగేశ్, గురుచరణ్, సాయన్న, నగేశ్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.